ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా

ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు పీసీసీ చీఫ్ రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు. నష్టపోయిన రైతులు, సామాన్య ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు.

వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. దొరల పాలనలో రైతులకు మిగిలింది ఏమీ లేదన్నారు. దొరల రాజ్యం పోయి రైతుల రాజ్యం రావాలన్నారు.  కేసీఆర్ రైతు హంతకుడని..రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.