- సాధ్యసాధ్యాలపై స్టడీ చేస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీతో భేటీ
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. అక్కడ ప్లాంట్ఏర్పాటు సాధ్యసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆఫీసర్ల బృందం స్టడీ చేస్తుందన్నదని చెప్పారు. శుక్రవారం ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీతో బేగంపేటలోని ఓ హోటల్లో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సందర్శించి అంచనాలు రూపొందిస్తుందని తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని భట్టి వివరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ విట్టల్, సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, ఆఫీసర్లు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
