
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా.. రూ.లక్ష మాఫీకి చర్యలు తీసుకోవడంపై తెలంగాణ వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత ఆదేశాల మేరకు ధరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు . గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి విడతగా రూ. లక్షలోపు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని హర్షం వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క,తుమ్మల నాగేశ్వర్ రావు ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేశారు. రైతులకు మిఠాయిలు తినిపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ మహోత్సవాల్లో భాగంగా నల్గొండ క్లాక్ టవర్స్ సెంటర్ నుంచి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. MNR గార్డెన్ లో రైతులతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు కలెక్టర్ నారాయణ రెడ్డి , వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు. పాల్గొన్నారు.
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతువేధికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమలో రైతులతో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.