తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు..స్పెషల్ గెస్ట్గా జపాన్ బృందం

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు..స్పెషల్ గెస్ట్గా జపాన్ బృందం


హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక లపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే అధికా రులు నాంపల్లి గన్ పార్క్ తో పాటు పరేడ్ గ్రౌం క్లాస్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జూన్ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలకు స్పెషల్ గెస్టు రానున్నారు. ఇందుకోసం జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చే సింది. జూన్ 2న ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు వేడుకలకు ఈ బృందం హాజరుకానుం ది. అంతేకాక, ఈ బృందం ఐటీసీ కాకతీయ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కితాక్యూషూ సిటీతో పరస్పర సహకార ఒప్పందంపై సంతకాలు చేయనుంది. 

ఇటీవల ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శిం చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు రావాలని మేయర్ను సీఎం ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితక్యూషూ.. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. హైదరాబాద్ నగరంలో సైతం కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కీలక ఎంవోయూలు చేసుకునే అవకాశం కన్పిస్తోంది.

స్కీములు స్పీడప్

మరోవైపు జూన్ 2న రాష్ట్ర అవతరణ ది నోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాల ని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. దీంతోపాటు ఇప్పటికే మొదలైన స్కీములను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 'మిషన్ 26 డేస్" పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తున్నది. లోకల్ బాడీస్ ఎన్ని కలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనాఅధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు,ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకూ నిర్ణయం తీసుకుంది. 3వ తేదీ నుంచి రాష్ట్రం వ్యాప్తంగా భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతున్నది.