డ్రిప్ ధరను పెంచిన ప్రభుత్వం

డ్రిప్ ధరను పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్‌‌, వెలుగు: సూక్ష్మ సేద్యం నిర్వహణకు వినియోగించే డ్రిప్ యూనిట్ ధరను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 12 ఎంఎం ధరను రూ.83,043 నుంచి రూ. 1,24,773కు, 16 ఎంఎం ధరను రూ.1,12,237 నుంచి రూ.1,44,202 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.