ఆటోమేటిక్ నీటి మీటర్ల కొనుగోలుకు ఓకే... రూ.31.70 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు

ఆటోమేటిక్ నీటి మీటర్ల కొనుగోలుకు ఓకే... రూ.31.70 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: క్యూర్​పరిధిలో ఆటోమేటిక్​మీటర్ల కొనుగోలు కోసం వాటర్​బోర్డుకు రూ.31.70 కోట్లను మంజూరు చేస్తూ మున్సిపల్​శాఖ పరిపాలనా అనుమతులను జారీ చేసింది. 

మూడు కార్పొరేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో 25 ఎంఎం(1/2 అంగళం) కనెక్షన్​లే ఎక్కువగా ఉన్నాయి. అలాగే, వాటర్​బోర్డు ఇంతకుముందు అమర్చిన ఆటోమేటిక్​మీటర్లు చాలా వరకు పని చేయడం లేదు. దీంతో సగటు బిల్లులను జారీ చేస్తుండడంతో ఆదాయం తగ్గుతోంది. 

ఈ నేపథ్యంలో ఏఎంఆర్​మీటర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపగా, ఓకే చెప్పారు. ఇప్పటికే 6,940 మంది కస్టమర్ల నుంచి ఏఎంఆర్​ మీటర్ల బిగింపు కోసం వసూలు చేసిన రూ.33 కోట్లు బోర్డు దగ్గరే ఉన్నాయి. వీటితో పాటు రూ.31.70 కోట్లను మంజూరు చేస్తూ మున్సిపల్​శాఖ పరిపాలనా అనుమతులను జారీ చేసింది. త్వరలో ఈ-ప్రొక్యూర్​మెంట్​ద్వారా మీటర్లు కొనాలని ఆదేశించింది.