బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిపై సీలింగ్ కూలిన ఘటనపై స్పందించిన గవర్నర్ 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిపై సీలింగ్ కూలిన ఘటనపై స్పందించిన గవర్నర్ 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిపై సీలింగ్ కూలిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందించారు. విద్యార్థి ధీమత్ కు గాయం కావడం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నెలకొన్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు విజయవంతంగా తమ చదువులపై ఏకాగ్రత సాధించాలంటే యూనివర్శిటీల్లో, కాలేజీల్లో అందించే సౌకర్యాలు మరింత మెరుగుపడాలని సూచించారు. క్యాంపస్‌లలో నాణ్యమైన, రుచికరమైన భోజనం, వసతి కల్పించాలని సూచించారు. విద్యార్థి ఆరోగ్యం గురించి వీసీని అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలియడంతో గవర్నర్ తమిళి సై ఊపిరి పీల్చుకున్నారు.