గుడ్ న్యూస్: రైతుల అకౌంట్లో రూ. 30 వేలు పడ్డయ్

గుడ్ న్యూస్:  రైతుల అకౌంట్లో రూ. 30 వేలు పడ్డయ్

తెలంగాణలో ఐదు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసింది ప్రభుత్వం. జూన్ 19న రూ.1189.43 కోట్లు రిలీజ్ చేసింది.   4 లక్షల 43 వేల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమచేసింది వ్యవసాయ శాఖ. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం 5 ఎకరాలున్న రైతు అకౌంట్లో రూ. 30 వేలు జమ చేసింది ప్రభుత్వం.

ఇప్పటి వరకు ప్రభుత్వం జూన్ 16న రెండెకరాల్లోపు రైతులకు, జూన్ 17న మూడెకరాల్లోపు,జూన్ 18న నాలుగు ఎకరాల్లోపు జూన్ 19న ఐదు ఎకరాల్లోపు  రైతు భరోసా నిధులు జమ చేసింది.  విడతల వారీగా డబ్బులు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో ప్రభుత్వం  62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6404.7 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక భూమి పరంగా చూసుకుంటే 106 లక్షల ఎకరాకు పంట సహాయం చేసినట్లు  ప్రభుత్వం ప్రకటించింది.


 మొత్తం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రిలీజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఎకరాలను చూడకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని అన్నారు.