
గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తామంది. ప్రిలిమినరీ మార్కుల కటాఫ్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుంతాతని ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 9న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఎగ్జామ్ కు మొత్తం మూడు లక్షల 20వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష పూర్తయ్యాక ప్రైమరీ కీ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ.. జూన్ 17లోపు అభ్యంతరాలు తెలపాలని సూచించింది. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న టీజీపీఎస్సీ బోర్డు.. ఇవాళ ఫైనల్ కీ రిలీజ్