రైతుల విషయంలో కలెక్టర్ ఎలా  వ్యాఖ్యలు చేస్తారు?

రైతుల విషయంలో కలెక్టర్ ఎలా  వ్యాఖ్యలు చేస్తారు?

వరివిత్తనాల అమ్మకాలపై సిద్ధిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు పిటీషనర్. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు.  దీనిపై  విచారణ జరిపిన హైకోర్టు.. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్ యాక్ట్ లో ఏమైనా చేర్చరా అని ప్రశ్నించింది.ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన  అడ్వొకేట్ జనరల్  బీఎస్ ప్రసాద్  అలాంటిది ఏమి లేదని కోర్టుకు తెలిపారు. అలాంటి చర్యలేమి ప్రభుత్వం తీసుకోలేదని ఇకపై కూడా తీసుకోబోదని చెప్పారు. రైతుల విషయంలో కలెక్టర్ ఎలా  వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించింది హైకోర్టు. కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందని.. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్టార్ కు అదేశించింది.