ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. వారు కూడా పాస్

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. వారు కూడా పాస్

హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల 589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. వీరిలో ఎగ్జామ్స్ కు హాజరుకాని 27, 251 మంది విద్యార్థులు, మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన 338 మంది విద్యార్థులకు కూడా గ్రేస్ మార్కులు ఇవ్వాలని బోర్డు తీర్మానించింది. కరోనా క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు.