
- మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
కరీం నగర్, వెలుగు: తెలంగాణ వైభవం వంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి
మరింత పటిష్టమవుతుందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు.
తెలంగాణ ఉ ద్యమం కన్నా ముందు మన సంస్కృతి గురించి మాట్లాడితే అంత గొప్పగా అనుకునేవారు కాదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో పాల్గొన్నారని, చరిత్రను బయటకు తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేశారన్నారు.
ప్రజ్ఞా భారతి సభ్యులు
వీ6 చానెల్ లో మన భాష, యాస వేస్తే మొదట్లో చాలామంది వెక్కిరించారన్నారు. కొద్దిరోజుల తర్వాత వారే మన భాష, కల్చర్ ను పొగిడారని గుర్తు చేశారు. ఉద్యమం
తరవాత మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకున్నారని తెలిపారు. తెలంగాణ యాసలో ఉన్న కార్యక్రమాలకు ఆంధ్రాలో కూడా మంచి ఆదరణ లభించడం మన గొప్పతనానికి నిదర్శనమన్నారు. బోనాలు, బతుకమ్మ వంటి పండగలు మన సంస్కృతికి ఆనవాళ్లని, మన కల్చర్ ను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పడానికి వీటి ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు.