ఆస్తి కోసం తండ్రిని చంపేసిండు

ఆస్తి కోసం తండ్రిని చంపేసిండు

చేవెళ్ల, వెలుగు: ఆస్తి కోసం కొడుకే తండ్రిని చంపేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గత నెల 28న బొమ్మిడి బుచ్చిరెడ్డి మృతదేహం గ్రామ శివారులోని పొలంలో దొరికింది. బుచ్చిరెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు విక్రంరెడ్డిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాతల భూమి 3 ఎకరాలను అదే గ్రామానికి చెందినవారికి దానం ఇవ్వడంతో విక్రంరెడ్డి కోర్టులో కేసు వేశాడు. బుచ్చిరెడ్డి రూ. 25 లక్షలకు వారితో రాజీ పడడంతో పొలం ఎక్కడ పోతుందోనని తన మామ నారాయణరెడ్డి, సడ్డకుడు దామోదర్​రెడ్డిని  పిలిపించి తండ్రిని చంపేందుకు పథకం వేశాడు. ఈ నెల 27న వికారాబాద్ లోని ఓ పొలంలో బుచ్చిరెడ్డికి మందు తాగించారు. మత్తులోకి జారుకున్న తర్వాత గొంతుకు టవల్​ బిగించి, పురుగుల మందు నోట్లో పోసి చంపేశారు. అనంతరం నవీన్ రెడ్డి కారులో తీసుకెళ్లి ఎన్కెపల్లి గ్రామ శివారులో పొలంలో పడేశారు. పోలీసులు నలుగురిని రిమాండ్​కు తరలించారు.