తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. 3 విడతల్లో ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి వెల్లడించారు. ఎంసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
మొదటి విడుత షెడ్యూల్..
* ఈ నెల 21నుండి 29 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్
*ఈనెల 23 నుంచి 30 వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
* ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
* సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
రెండో విడుత షెడ్యూల్..
* సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
* సెప్టెంబరు 30న రెండో విడతలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
* సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
* అక్టోబర్ 4న రెండో విడతలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
మూడో విడుత షెడ్యూల్..
* అక్టోబర్ 11 నుండి తుది విడత కౌన్సెలింగ్
* అక్టోబరు 13న తుది విడతలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్
* అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
* అక్టోబర్ 17న తుది విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
* అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించే అవకాశం