బీజేపీ స్టేట్ ఆఫీసు భద్రతపై పోలీసుల ఫోకస్

బీజేపీ స్టేట్ ఆఫీసు భద్రతపై పోలీసుల ఫోకస్

హైదరాబాద్, వెలుగు: నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసు సెక్యూరిటీపై సిటీ పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పార్టీ కార్యాలయానికి మరోసారి వచ్చిన పోలీసు అధికారులు భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించారు. జనవరిలో కూడా పార్టీ ఆఫీసుకు వచ్చి సెక్యూరిటీ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇప్పుడు మరోసారి ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఆఫీస్​ కొలతలు తీసుకున్నారు. ఆఫీసు చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసు టెర్రరిస్టు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీసును పోలీసులు పరిశీలించి, అక్కడ ఉన్న సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. కాగా, బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసుకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదేనని పార్టీ నేతలు చెబుతుండగా.. సెక్యూరిటీకి అవసరమైన ఖర్చును మాత్రం పార్టీ భరించాలని పోలీసు అధికారులు చెప్పినట్టు తెలిసింది.