ఆర్ అండ్‌‌‌‌‌‌‌‌ బీ ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి : మంత్రి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

ఆర్ అండ్‌‌‌‌‌‌‌‌ బీ ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి : మంత్రి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • వర్షాకాలంలో కల్వర్టులు, బ్రిడ్జిలు, ఆర్వోబీలను తనిఖీ చేయండి: మంత్రి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రోడ్డు ప్యాచ్​వర్క్‌‌‌‌‌‌‌‌లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున జిల్లాల్లో ఆర్ అండ్ బీ అధికారులు అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. కల్వర్టులు, ఆర్వోబీలు తనిఖీ చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న వాటి ప్రోగ్రెస్‌‌‌‌‌‌‌‌తో పాటు వాడుకలో ఉన్న వాటి వివరాలతో వారంలోపు నివేదిక అందజేయాలని సూచించారు. రోడ్లపై పొలాలు సాగు చేసే కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి రివ్యూ చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజనీర్లు, జిల్లాల్లో సూపరిండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, క్షేత్ర స్థాయి ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీకి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. 

వరదల వల్ల డ్యామేజ్ అయిన రోడ్లు వెంటనే రీ స్టోర్ చేసేందుకు వీలుగా సాండ్ బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉధృతంగా ప్రవహించే నదులు వాగుల వద్ద బ్రిడ్జిలు, కల్వర్టులపై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకనుగుణంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ సెంటర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్ అండ్ బీ హెడ్ ఆఫీసుకు కనెక్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. 

రోడ్లపై గుంతులు పూడ్చండి..

రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ బీ పరిధిలో  ఉన్న రోడ్లపై గుంతలు పూడ్చాలని అధికారులను మంత్రి కోమటి రెడ్డి ఆదేశించారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో యుద్ధ 
ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టామని అధికారులు మంత్రికి వివరించారు. ఆర్ అండ్ బీ స్టేట్ రోడ్లకు సంబంధించి మొత్తం 1,214 గుంతలు ఏర్పడి 2,488 కిలోమీటర్ల మేర రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని,  2,186 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన రోడ్ల ప్యాచ్ వర్క్‌‌‌‌‌‌‌‌లు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.