పూర్తైన సెక్రటేరియట్ షిప్టింగ్..!

పూర్తైన సెక్రటేరియట్ షిప్టింగ్..!

సెక్రటేరియట్ షిప్టింగ్ దాదాపుగా పూర్తైంది. ముఖ్యమంత్రి కార్యాలయం సహా సీ, డీ బ్లాక్ లో మిగిలిపోయిన ఫర్నీచర్ ను ఇవాళ తరలించారు జీఏడీ అధికారులు. దీంతో సామాగ్రిని మొత్తం తరలించనట్లేనని చెబుతున్నారు. సెక్రటేరియేట్ గేట్లకు తాళం వేయనున్నారు. ఇప్పటికే లుంబినీ పార్కు వైపు ఉన్న ఏపీ సెక్రటేరియట్ గేటుకు తాళం వేశారు. రేపటి నుంచి పూర్తి పరిపాలన BRK భవన్ నుంచే కొనసాగనుంది. BRK భవన్ లో సీఎస్ ఎస్కే జోషి సహా ఉన్నతాధికారుల చాంబర్లు సిద్ధమయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 9 మంది మంత్రులకు కేటాయించిన చాంబర్లలో రెనొవేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.