హైదరాబాద్ : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాదవిలతపై మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి బుర్ఖా వేసుకొని వచ్చిన ముస్లీం మహిళ ఐడీ ఫ్రూఫ్ చెక్ చేశారు. ముస్లీం మహిళల హిజాబ్ తొలగించి ఓటర్లను చెక్ చేశారు. మాదవిలత అనుచితంగా ప్రవర్తించారని ఆమెపై మలక్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు తొలగించారని కూడా ఆరోపించారు.
#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C
— ANI (@ANI) May 13, 2024
అజంపూర్లోని పోలింగ్ బూత్ కు వచ్చిన మాధవీలత అక్కడ ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళల ఐడీలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఐడీని చూసి బురఖా ధరించిన స్త్రీని తన ముసుగును ఎత్తమని మాధవీలత అడగిన వీడియో వెలుగుచూసింది. ఐడీ కార్డులను సరిగ్గా సరిచూసుకున్న తర్వాతే ఓటింగ్కు అనుమతించాలని మాధవీలత పోలింగ్ అధికారులను కోరారు. ఓటరు జాబితాలో తేడాలున్నాయని, పలువురు ఓటర్ల పేర్లు జాబితాలో లేవని ఆమె ఆరోపించారు.
