V6 News

మంగళవారం మంట..24 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్

మంగళవారం మంట..24 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్
  • 24 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్
  • మిగతా జిల్లాల్లోనూ 41 డిగ్రీలకుపైగా నమోదు.. హైదరాబాద్‌‌‌‌లో తొలిసారి 40 డిగ్రీల మార్క్​
  • మల్కాజ్‌‌‌‌గిరిలో 41.9 డిగ్రీల మేర రికార్డ్.. సిటీవ్యాప్తంగా హీట్​వేవ్స్​
  • రాష్ట్రానికి వారం రోజులపాటు హీట్​వేవ్స్​ అలర్ట్​.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే చాన్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నయ్. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రమవుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రమంతటా 41 డిలగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. హీట్​వేవ్స్​ పరిస్థితులున్నాయి. మంగళవారం మంగళవారం 24 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా నమోదైతే.. అందులో ఆరు జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 19 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా ఘనపూర్​లో 43.5 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా కథలాపూర్​లో 43.4 డిగ్రీలు, నిర్మల్​ జిల్లాలో 43.3, నిజామాబాద్​ జిల్లా మాచర్లలో 43.3, ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలో 43.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

 కామారెడ్డి, గద్వాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, నాగర్​కర్నూల్, సిద్దిపేట, సూర్యాపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, కరీంనగర్, సంగారెడ్డి, వనపర్తి, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్​ సిటీలో ఉష్ణోగ్రతలు తొలిసారి 40 డిగ్రీల మార్క్​ను అందుకున్నాయి. రెండ్రోజుల కిందటిదాకా 39 డిగ్రీల వద్దే టెంపరేచర్లుండగా.. మంగళవారం ఒక్కసారిగా రెండు డిగ్రీలు ఎక్కువ నమోదైంది. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో 41.9 డిగ్రీలు, మేడ్చల్​ మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరిలో 41.6, బేగంబజార్​లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హయత్​నగర్​లో 41, సంతోష్​నగర్​40.9, బేగంపేటలో 40.9, షేక్​పేటలో 40.8, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ పురంలో 40.8, సూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40.7, ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40.5, కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో 40.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జరపైలం.. హీట్​వేవ్స్​ ముప్పు..

వాస్తవానికి రాష్ట్రానికి హీట్​వేవ్స్​ ముప్పు లేదని ఐఎండీ 10 రోజుల క్రితం ఇచ్చిన ఔట్​లుక్​లో వెల్లడించింది. అయితే, పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదకు వీస్తున్న తీవ్రమైన వేడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు వెదర్​ ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వార్నింగ్స్​ ఇస్తున్నారు. బుధవారం నుంచి రెండ్రోజుల పాటు ఉత్తరాది జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని, ఆ తర్వాత అది దక్షిణాది జిల్లాలతో పాటు రాష్ట్రమంతటికీ విస్తరించే ముప్పు ఉందని హెచ్చరించారు. ఈ టైంలోనే టెంపరేచర్లు గరిష్ఠంగా 45 డిగ్రీల మార్క్​నూ టచ్​ అయ్యే అవకాశాలూ లేకపోలేదని చెప్తున్నారు. హైదరాబాద్​ సిటీ పరిధిలోనూ 41 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అలర్ట్​ ఇచ్చారు.