సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్రావతరణ రిహార్సల్స్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్రావతరణ రిహార్సల్స్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో ఆదివారం పోలీసుల కవాతు, సాంస్కృతిక ప్రదర్శనల  రిహార్సల్స్​నిర్వహించారు.  జూన్ 2న జరిగే ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా చేపట్టిన ఈ రిహార్సల్స్‌‌‌‌‌‌‌‌ను లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేశ్​భగవత్​తో పాటు మల్కాజిగిరి సీపీ సుమతి ఇతర అధికారులు వీక్షించారు. 

కాగా, వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచే పరేడ్ గ్రౌండ్​ను తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. 

-పద్మారావు నగర్, వెలుగు