మూడు MLC స్థానాలకు ఓటర్ లిస్ట్ రెడీ

మూడు MLC స్థానాలకు ఓటర్ లిస్ట్ రెడీ

గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో.. 1,90,082 ఓటర్లు

రెండు టీచర్ సెగ్మెంట్లలో ..43,060 మంది

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో రెండు టీచర్స్‌‌ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు సీఈవో రజత్ కుమార్ ఓటర్ జాబితా ప్రకటించారు. శుక్రవారం ఆయన జాబితాను విడుదల చేశారు. మెదక్ , నిజామాబాద్ , ఆదిలాబాద్ , కరీంనగర్ గ్రాడ్యుయేట్​ ఎమ్మె ల్సీ సెగ్మెంట్​లో 1,90,082 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 1,30,957 మంది, మహిళలు 59,099 మంది, ఇతరులు 26 మంది ఉన్నారు. అదే సెగ్మెంట్​లో టీచర్ ఎమ్మె ల్సీలకు సంబంధించి 22,475 మంది ఓటర్లున్నారు.

పురుషులు 15,407, మ హిళలు 7, 068 మంది ఉన్నారు. వరంగల్ , ఖమ్మం , నల్లగొండ టీచర్స్​ ఎమ్మె ల్సీ సెగ్మెంట్​లో మొత్తం 20,585 మంది ఓటర్లున్నారు. పురుషులు 13,476 మంది, మహిళలు 7,106 మంది, ఇతరులు ముగ్గురు ఓటర్లున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును సరిచూసుకోవాలని, సమస్యలుం టే టోల్ ఫ్రీ హెల్ప్​లైన్​ నెంబర్ 1950 లేదా సీఈవో తెలంగా ణ వెబ్ సైట్​లో సంప్రదించవచ్చని ఆయన వివరించారు.