- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుగు : ప్రతి ఉమ్మడి జిల్లాకో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్వర్సిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ విద్యను విస్తరించి, రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నిజామాబాద్లో అగ్రికల్చర్ కాలేజీకి సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు.
