మంత్రి పొన్నం చేతుల మీదుగా పంచ్​ కారు లాంచ్​

మంత్రి పొన్నం చేతుల మీదుగా పంచ్​ కారు లాంచ్​

హైదరాబాద్​, వెలుగు :  టాటా పంచ్ ఎలక్ట్రిక్​కారును సికింద్రాబాద్​లోని జాస్పర్​ షోరూమ్​లో  తెలంగాణ రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ లాంచ్​ చేశారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీ, జాస్పర్​ గ్రూప్ ​ప్రెసిడెంట్​ బడిగ రామకృష్ణ, టాటా మోటార్స్​ అధికారులు పాల్గొన్నారు. తాము 1954 నుంచి ఆటోమొబైల్​రంగంలో ఉన్నామని జాస్పర్​ తెలిపింది.

టాటా పంచ్​ ధరలు రూ.11 లక్షల నుంచి రూ.15.50 లక్షల వరకు ఉంటాయి. దీనిని ఒక్కసారి చార్జ్​ చేస్తే 421 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఇందులో 10.25 ఇంచుల డిజిటల్ డిస్​ప్లే, ఆరు ఎయిర్​బ్యాగ్స్​, వెంటిలేటెడ్​ ఫ్రంట్​సీట్ల వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.