హైదరాబాద్, వెలుగు : టాటా పంచ్ ఎలక్ట్రిక్కారును సికింద్రాబాద్లోని జాస్పర్ షోరూమ్లో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, జాస్పర్ గ్రూప్ ప్రెసిడెంట్ బడిగ రామకృష్ణ, టాటా మోటార్స్ అధికారులు పాల్గొన్నారు. తాము 1954 నుంచి ఆటోమొబైల్రంగంలో ఉన్నామని జాస్పర్ తెలిపింది.
టాటా పంచ్ ధరలు రూ.11 లక్షల నుంచి రూ.15.50 లక్షల వరకు ఉంటాయి. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఇందులో 10.25 ఇంచుల డిజిటల్ డిస్ప్లే, ఆరు ఎయిర్బ్యాగ్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్సీట్ల వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.