- జడేజా, బుమ్రా, షమీ రీఎంట్రీ
న్యూఢిల్లీ: శ్రీలంకతో హోమ్ సిరీస్కు ముందు హిట్మ్యాన్ రోహిత్ శర్మను ఇండియా టెస్టు కెప్టెన్గా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అదే టైమ్లో మొహాలీలో తన వందో టెస్టు ఆడనున్న విరాట్ కోహ్లీ అంతకుముందు లంకతో టీ20 సిరీస్ నుంచి బ్రేక్ తీసుకుంటాడని తెలుస్తోంది.మరో సీనియర్ ప్లేయర్ లోకేశ్ రాహుల్ టీ20లతో పాటు ఫస్ట్ టెస్టుకు అందుబాటులో ఉండబోడని సమాచారం. శ్రీలంకతో ఈ నెల 25 నుంచి జరిగే మూడు టీ20లు, రెండు టెస్టుల కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఒకటి రెండు రోజుల్లో ఇండియా టీమ్ను ప్రకటించనుంది. ప్రస్తుత సమాచారం మేరకు కోహ్లీకి బయో బబుల్ నుంచి బ్రేక్ ఇవ్వనున్నారు. దాంతో, టీ20 సిరీస్కు తను దూరంగా ఉండనుండగా.. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీఖాయమైంది. అలాగే, విండీస్తో టీ20, వన్డేలకు దూరంగా ఉన్న పేసర్లు బుమ్రా, షమీ కూడా తిరిగి రానున్నారు. అయితే, గాయం వల్ల స్పిన్నర్ సుందర్ లంకతో టీ20, టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని, కేఎల్ రాహుల్ టీ20లతో పాటు ఫస్ట్ టెస్టుకు దూరంగా ఉంటాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.