
తెలంగాణ బాలికల గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు ఈనెల 10వ తేదీన నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది. ఆ పరీక్షను ఈ 19వ తేదీన నిర్వహించనున్నట్లు గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10న MPTC,ZPTC పొలింగ్ ఉన్నందున పరీక్ష తేదీని మార్చాల్సి వచ్చిందన్నారు. అభ్యర్థులు హల్టికెట్లను ఈనెల 10వ తేది నుంచి tsrjdc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.