సర్కార్ స్కూళ్ల పరిస్థితి దారుణం: మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి

సర్కార్ స్కూళ్ల పరిస్థితి దారుణం: మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి

కామారెడ్డి జిల్లా: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మాజీ IAS ఆకునూరి మురళి. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి క్లాసు రూంలు, టాయిలెట్స్,తాగునీటి వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ స్కూళ్లను కేసీఆర్  పట్టించుకోవడం లేదన్నారు ఆకునూరి మురళి. పాఠశాలల పైకప్పులు పెచ్చులూడిపోయి, కూర్చోడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితులో ఉన్నాయన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పై ఏడున్నరేళ్లలో కేసీఆర్ ఒక్కరోజు కూడా రివ్యూ చేయలేదని విమర్శించారు.