- భారత్ మండపంలోకి నీళ్లొచ్చాయ్
- రూ. 2,700 కోట్లు వేస్ట్ చేసిన్రు: కాంగ్రెస్
న్యూఢిల్లీ : జీ20 సమిట్ వేదిక అయిన ఢిల్లీలోని భారత్ మండపంలోకి వర్షపు నీళ్లు చేరాయని, ప్రధాని మోదీ సర్కారు అభివృద్ధి అంతా నీళ్లలో తేలుతోందని కాంగ్రెస్ విమర్శించింది. ‘‘భారత్ మండపం వర్షపు నీళ్లతో నిండిపోయింది. మెషిన్లతో బయటికి పంపుతున్నారు.
బీజేపీ అభివృద్ధి అంతా నీళ్లలో తేలుతున్నది చూడండి..” అంటూ కాంగ్రెస్ లీడర్లు, ఆప్ నేతలు ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. రూ.2,700 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భారత్ మండపంలో ఒక్క వర్షానికే నీళ్లు చేరాయని విమర్శలు చేశారు. ‘‘ఇంత నీచంగా ఏ అవినీతిపరుడు మండపాన్ని కట్టించాడు?” అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనతే ఫైర్ అయ్యారు.