హాస్టల్ లో ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం

హాస్టల్ లో ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం

హైదరాబాద్: ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శనివారం హైదరాబాద్ లో జరిగింది. చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధి, అలకపూరిలోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో తేజస్విని అనే ఫార్మసీ విద్యార్థిని ఫ్యాన్ కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

తన అన్నను డాక్టర్ కావాలని, తన మరణానికి ఎవరు బాధ్యులు కారని సూసైడ్ నోట్ లో తెలిపి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. తేజస్వినిని యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన సర్పంచ్ కూతురుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.