1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తి.. రూ. 8,744 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తి.. రూ. 8,744 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత వానాకాలం సీజన్‎కు రైతు భరోసా పథకం అమలులో భాగంగా 15 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని సర్కారు అందించింది. ఇప్పటివరకూ మొత్తం 1.46 కోట్ల ఎకరాలకుగాను ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,744.13 కోట్ల నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. మంగళవారం రూ.459.47 కోట్ల నిధులు విడుదల చేశారు. దీంతో 69.40 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందినట్లయింది. 

జిల్లాల వారీగా జమ చేసిన రైతు భరోసా నిధుల వివరాలను చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5.27 లక్షల మంది రైతులకు రూ.718 కోట్లు జమ అయ్యాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 3.38 లక్షల మంది రైతులకు రూ.428 కోట్లు, సంగారెడ్డిలో  రూ.423 కోట్లు, నాగర్ కర్నూల్​లో రూ.416 కోట్ల నిధులు జమ చేశారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 వేల మందికి రూ.23.62 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి.