భారత్ మండపంలోని ఓపెన్ ఏరియాలోకే కొద్దిగా నీళ్లొచ్చాయ్ : పీఐబీ

భారత్ మండపంలోని ఓపెన్ ఏరియాలోకే కొద్దిగా నీళ్లొచ్చాయ్ : పీఐబీ

న్యూఢిల్లీ : భారత్ మండపంలోకి వర్షపు నీళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. రాత్రంతా కురిసిన వర్షం వల్ల భారత్ మండపంలోని హాల్ నెంబర్ 5 ముందు ఓపెన్ ఏరియాలో మాత్రమే కొద్దిగా నీళ్లు జమ అయ్యాయని, ఆ నీళ్లను సిబ్బంది 20 నిమిషాల్లోనే క్లియర్ చేశారని తెలిపింది. 

అంతేతప్ప సమిట్ ప్రధాన వేదిక వద్ద, ఇతర చోట్ల వాటర్ లాగింగ్ జరగలేదని, గెస్ట్ లకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని పేర్కొంది. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపారంటూ సిబ్బంది నీళ్లను క్లియర్ చేసిన వీడియోను ట్వీట్ చేసింది.