రైతుల కోసమే రైతన్న సినిమా తీశా

రైతుల కోసమే రైతన్న సినిమా తీశా

అగ్రీ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని నటుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఈనెల 11న ఆయన నటించిన రైతన్న సినిమా రిలీజ్ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి  పట్టణానికి వచ్చారు. రైతుల కోసమే రైతన్న సినిమా తీశామని ఆయన అన్నారు. M.S స్వామినాథన్ సిఫార్సులను చట్టబద్ధం చేయాలని నారాయణ మూర్తి సూచించారు. ఇతర రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి విజయం సాధించడం మంచి పరిణామమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.