ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది

ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది

కేసీఆర్ సీఎంగా ఉండగా ఏపీ ఒక్క చుక్క నీటిని కూడా తీసుకెళ్లే ధైర్యం చేయదన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మంత్రులుగా పని చేసినప్పుడు జానారెడ్డి, కోమటి రెడ్డి…. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మాట్లాడలేదని విమర్శించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు గుత్తా. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడితే తలా తోకా వుండదని..ఆయన సొంత ఊరిలో ప్రాజెక్ట్ SRSP స్టేజ్ 2 ద్వారా సూర్యాపేటలో కూడా 4 లక్షల ఎకరాలకు నీలిచ్చామన్నారు. కొండ పోచమ్మ పూర్తి అయ్యిందని.. తర్వాత గంద మల్లమ్మకే నీళ్ళు వస్తాయని తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్