వైద్యుల నిర్లక్ష్యం.. గర్భంలోనే కవలలు మృతి

వైద్యుల నిర్లక్ష్యం.. గర్భంలోనే కవలలు మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే కవలలు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకుంది. స్థానిక నిజాంపురాకు చెందిన పర్వీన్ అనే గర్భిణీ  చెకప్ కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి రాగా..ఆమెకు ట్రీట్ మెంట్ చేయడంతో ఇద్దరు శిశువులు గర్భంలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. గర్భంలోనే శిశువులు మృతి చెందారని తెలియడంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే కవలలు చనిపోయారని ఆరోపించారు.