మద్యం పెట్టిన చిచ్చు భార్యని పారతో కొట్టి చంపిన భర్త

మద్యం పెట్టిన చిచ్చు భార్యని పారతో కొట్టి చంపిన భర్త

హైదరాబాద్: కట్టుకున్నవాడే మద్యం మత్తులో భార్యను కడతేర్చిన ఘటన  మలక్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దిల్‬షుఖ్నగర్ ప్రాంతంలోని శాలివాహన నగర్‌ నారాయణి గౌసేవా సదన్‌లో భార్యాభర్తలు వెంకటేష్, కృష్ణవేణిలు నివాసం ఉంటున్నారు. వెంకటేష్ తరుచూ మద్యం తాగి భార్యతో గొడవపడే వాడు. ఎప్పటిలాగే నిన్న  (మార్చి 9) మద్యం తాగివచ్చి రాత్రి కృష్ణవేణితో వివాదానికి దిగాడు. అర్థరాత్రి భార్య నిద్రిస్తుండగా   వెంకటేష్‌ మద్యం మత్తులో పారతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో కృష్ణవేణి అక్కడికక్కడే చనిపోయింది. ఉదయాన్నే సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.