వసూళ్లలో దూసుకుపోతున్న 'ది కేరళ స్టోరీ'.. రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే..

వసూళ్లలో దూసుకుపోతున్న 'ది కేరళ స్టోరీ'.. రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే..

సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ది కేరళ స్టోరీ' రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు రూ.8.03కోట్లు, రెండో రోజు రూ.11.22కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ఇప్పటివరకు దాదాపు రూ.20కోట్లు రాబట్టింది. మొదటిరోజుతో పోలిస్తే.. రెండో రోజు 39.73శాతం వృద్ధిని కనబర్చింది. మే 5న వివిధ కాంట్రవర్సీల నడుమ విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ.19.25కోట్లు వసూలు చేసినట్టు ఆయన వెల్లడించారు.

'ది కేరళ స్టోరీ'లో అదా శర్మ , యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కావడంతో వివాదం తలెత్తింది. మహిళలను మతం మార్చి టెర్రరిజంలోకి మార్పిడి చేయిస్తున్నారని ఈ సినిమాపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ సినిమాపై ఇటీవలే ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఉగ్రవాద పరిణామాలను బయటపెట్టిన కేరళ స్టోరీ సినిమాను ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకిస్తోందని ఆయన ఆరోపించారు.

https://twitter.com/taran_adarsh/status/1655097482638925824