‘పిశాచి’ సీక్వెల్‌గా ‘పిశాచి 2’

 ‘పిశాచి’ సీక్వెల్‌గా  ‘పిశాచి 2’

హారర్ సినిమాల జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కొత్త ట్రెండును క్రియేట్ చేసింది ‘పిశాచి’ సినిమా. రొటీన్ హారర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. సినిమా మొత్తంలో హీరో ముఖం కూడా పూర్తిగా కనిపించదు. అయినా కూడా కట్టి పడేసే కథ.. మనసును కదిలించే ఎమోషన్స్.. చక్కని పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్సెస్.. ఇవన్నీ కలిసి ఆ సినిమాని సక్సెస్ చేశాయి. ఇప్పుడు దానికి సీక్వెల్‌‌‌‌‌‌‌‌ తీస్తున్నారు డైరెక్టర్ మిస్కిన్. ‘పిశాచి 2’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆండ్రియా జెర్మియా, పూర్ణ, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూవీ ఎలా ఉండబోతోందో రుచి చూపించారు. నిన్న ఓ మంచి మెలోడియస్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇళయరాజా కొడుకు కార్తీక్ రాజా ట్యూన్ చేసిన ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. పోతుల రవికిరణ్ రాసిన లిరిక్స్‌‌‌‌‌‌‌‌ మనసును తాకేలా ఉన్నాయి. ‘కాలమెంత వేగములే.. ఆగమంటే ఆగదమ్మా.. కళ్లముందు యోగములే.. అందుకుంటే అందవమ్మా’ అంటూ సిద్‌‌‌‌‌‌‌‌ శ్రీరామ్ పాడిన విధానం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. ‘విధిరాత అన్నదే ఎదిరించలేవులే.. ఎడబాటు అన్నదే అలవాటు కాదులే’ అంటూ రాయడాన్ని బట్టి ఇదొక శాడ్ సిట్యుయేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చే పాట అని అర్థమవుతోంది.