హామిల్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనలే లక్ష్యంగా న్యూజిలాండ్ సిరీస్లో నంబర్వన్ టీమ్ లెవెల్లో పెర్ఫామ్ చెయ్యాలని టార్గెట్గా పెట్టుకున్నామని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం చాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లో ఉన్న ఇండియా ఫైనల్కు అర్హత సాధించాలంటే కనీసం మరో 100 పాయింట్లు కావాలి. కివీస్(2), ఆస్ట్రేలియా(4)లో ఆడే ఆరు టెస్ట్ల్లో కనీసం రెండు గెలిస్తే ఇండియా ఫైనల్ రేస్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గురించి కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘లార్డ్స్లో జరిగే ఫైనల్ ఆడాలంటే మాకు ఇంకో 100 పాయింట్లు కావాలి. విదేశీ గడ్డపై ఆడే ఆరు టెస్ట్ల్లో కనీసం రెండింటిలో గెలిస్తే రేస్లో ఉంటాం. కివీస్ సిరీస్లో ఈ అంశాన్నే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతేకాక వరల్డ్ నంబర్వన్ టీమ్ అయిన మేము అదే లెవెల్లో ఆడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వరల్డ్ నంబర్వన్ అనే ఫీలింగ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అని చెప్పాడు. ఓపెనింగ్ స్లాట్గురించి మాట్లాడుతూ.. ‘ఫైనల్ ఎలెవన్లో ఎవరుంటారనేది పక్కనబెడితే పృథ్వీ షా, శుభ్మన్ గిల్ ఇద్దరూ చాలా టాలెంటెడ్ క్రికెటర్లు. వాళ్లిద్దరూ నేషనల్ టీమ్ సభ్యులనేది నిజం. ముఖ్యంగా గిల్ చాలా పాజిటివ్ మైండ్సెట్తో బ్యాటింగ్ చేస్తాడు. వామప్ గేమ్లో ఫెయిలైనప్పటికీ గిల్, మయాంక్, పృథ్వీది ఒకటే స్కూలు. న్యూ బాల్ చాలెంజ్ను వాళ్లు ఇష్టపడతారు. అనుకోకుండా రోహిత్ టీమ్కు దూరమయ్యాడు. అందువల్ల గిల్, షాలో ఒకరు మయాంక్తో కలిసి ఫస్ట్ టెస్ట్లో ఓపెనింగ్కు వస్తారు. ఇలాంటి పోటీ ఉంటేనే జట్టు బలంగా ఉంటుంది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
నంబర్వన్లా ఆడతాం: రవిశాస్త్రి
- విదేశం
- February 15, 2020
లేటెస్ట్
- నిర్మల్లో 87 సెల్ ఫోన్ల రికవరీ
- తెలంగాణలో ప్రధాని మోదీ, అమిత్ షా షెడ్యూల్ ఇదే
- తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు
- క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
- అధిష్టానం నిర్ణయం మేరకే చేరికలు : బత్తుల లక్ష్మారెడ్డి
- అమిత్ షా హోంగార్డులా మాట్లాడారు : చామల కిరణ్ కుమార్ రెడ్డి
- ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం : ఉత్తమ్కుమార్ రెడ్డి
- రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- బీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకుంది : భట్టి విక్రమార్క
- ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం : రాందాస్ నాయక్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..