తెలంగాణలో ప్రధాని మోదీ, అమిత్ షా షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ప్రధాని మోదీ, అమిత్ షా షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది.  ప్రచారానికి రెండు రోజులే ఛాన్స్ ఉంది. దీంతో క్యాంపెయిన్ స్పీడప్ చేశారు కమలం నేతలు. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారాన్ని చేస్తున్నారు. మే9న కేంద్రహోమంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయగా..  మే10న రాష్ట్రానికి రానున్నారు ప్రధాని మోదీ. మధ్యాహ్నం 3గంటలకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని నారాయణపేట బహిరంగ సభలో పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు ప్రధాని మోదీ.

ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు ప్రధాని. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో  జరిగే బహిరంగ సభకు హాజరు అవుతారు మోదీ. సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం  చేస్తారు.  ఆ తర్వాత బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఒడిశాలోని భువనేశ్వర్ కు వెళ్తారు.

మే 11న మరోసారి తెలంగాణకు రానున్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్, వనపర్తి సభల్లో పాల్గొంటారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు.