- బైరామల్గూడ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు
- ఎల్బీ నగర్ అభివృద్ధికి ప్రయార్టీ ఇవ్వాలి: ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది.. సిటీ ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. శనివారం బైరామల్గూడ ఫ్లైఓవర్ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సిటీలో ట్రాఫిక్ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అల్వాల్లో ఎలివేటెడ్ కారిడార్కు శుంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. దీర్ఘకాలిక అవసరాలు, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నలువైపులా డెవలప్చేస్తామని చెప్పారు.
అదే సమయంలో జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎల్బీనగర్ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన రేవంత్రెడ్డికి మెజారిటీ ఇచ్చిన ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉండాలని కోరారు. ఎల్బీనగర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అన్నింటిని వివరించేందుకు సీఎంని పర్సనల్గా కలుస్తానని చెప్పారు. ఎల్బీనగర్ప్రజలు రేవంత్ను ఆదరించి ఎంపీగా గెలిపించాకనే, పీసీసీ చీఫ్, ఆ తర్వాత సీఎం అయ్యారని చెప్పారు.
మేయర్ గద్వాల్విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరోనా టైంలోనూ పనులను ఆపకుండా ఎస్ఆర్డీపీ కింద వ్యూహాత్మక ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటివరకు సిటీలో 35 ప్రాజెక్టులు పూర్తిచేశామని వివరించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, సిటీ అభివృద్ధికి అందరి సహకారం ఉండాలన్నారు.