నీలోఫర్ హాస్పిటల్ లో చిన్నారులకు బెడ్స్ కొరత 

నీలోఫర్ హాస్పిటల్ లో చిన్నారులకు బెడ్స్ కొరత 

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ పిడియాట్రిక్ దవాఖానా .. నీలోఫర్. వెయ్యి పడకల సామర్ద్యమున్న ఈ హాస్పిటల్ కు రోజూ వేలాది మంది వస్తుంటారు. ఉన్న బెడ్స్ కు.. అడ్మిట్ అవుతోన్న పేషంట్స్ కు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో.. ఒకే బెడ్ పై ఇద్దరు, కొన్ని సందర్భాల్లో ముగ్గురు చిన్నారులను పడుకోబెడుతున్నారు. NICU నుంచి జనరల్ వార్డ్ వరకూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు చిన్నారుల తల్లిదండ్రులు.

 సీజన్ తో సంబంధం లేకుండా.. హాస్పిటల్లోని బెడ్స్ అన్ని ఎప్పుడూ ఫుల్ అవుతాయి. ఈ సీజన్లో పిడీయాట్రిక్ కేసులు తక్కువగా ఉంటాయి. ఐనా కూడా ఇక్కడ బెడ్స్ సరిపోవడం లేదంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. ముఖ్యంగా నీలోఫర్ కు ప్రిటర్మ్ బేబీ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. జిల్లా ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి రిఫరెన్స్ మీద ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ప్రైవేట్ లో NICU ట్రీట్మెంట్ కు రోజుకు లక్ష వరకూ ఖర్చవుతుంది. దీంతో.. పేద, మధ్య తరగతి వారికి.. నీలోఫర్ హాస్పిటలే దిక్కు.... 

నీలోఫర్ లో వైద్యం అందుతున్నా.. వసతులు మాత్రం సరిగా లేవంటున్నారు పేషెంట్ బంధువులు. ఒకే ఇంక్యుబేటర్ బాక్సులో ఇద్దరు చిన్నారులను పడుకోబెడుతున్నారు. ఇంక్యుబేటర్స్ సరిపోకపోవడంతో...  పసికందులను నేలపైనే ఉంచి ఆక్సిజన్ పెడుతున్నారు. ఒకే బెడ్ పై ఇద్దరు ఉంటే..  ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్.... 

ఇక హాస్పిటల్ లో బెడ్స్ కొరతతో పాటు.. మెడిసిన్ కూడా సరిగా ఇవ్వడం లేదంటున్నారు చిన్నారుల పేరెంట్స్. కాస్ట్లీ మెడిసిన్  అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో తెచ్చుకుంటున్నారు. ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతున్నా... మెడిసిన్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు తల్లిదండ్రులు.

నీలోఫర్ లో బెడ్స్ కొరత ఉండడంతో.. 6 వందల బెడ్స్ కెపాసిటీ తో కొత్త బిల్డింగ్ ను కడుతున్నారు. కరోనా తర్వాత నీలోఫర్ లో ఆ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీనికి తోడు.. నిధుల కొరత ఉండడంతో డెవలప్మెంట్స్ కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడుతున్నారు అధికారులు. బెడ్స్, ఇంక్యుబేటర్స్, ఆక్సిజన్ కోసం.. సీఎస్ఆర్ యాక్టివిటీ తోటే పనులు అవుతున్నాయి. అంతేకాక.. సీఎస్ఆర్ ఫండ్స్ కోసం.. అధికారులే కంపెనీలను అడుగున్నారని తెలుస్తోంది. కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చినా... డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలంటున్నారు పబ్లిక్. ప్రస్తుతం బెడ్స్ పెంపుతో పాటు.. స్టాఫ్ ను కూడా పెంచాలంటున్నారు.