
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ తరహాలో బీజేపీ కూడా ఆశవాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే దరఖాస్తులకు ఎటువంటి రుసుము లేకపోవడంతో భారీగానే అప్లికేషన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర బీజేపీలో అసెంబ్లీ టికెట్ కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
ALSO READ :వచ్చే ఎన్నికల్లో నేను మూడోసారి గెలవడం ఖాయం: ముత్తిరెడ్డి
దరఖాస్తులకు ఎటువంటి రుసుము లేనందున ఒక్కొక అభ్యర్థి 3, 4 అసెంబ్లీ స్థానాలకు అప్లై చేసుకుంటున్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉండడం వల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేతలు అంటున్నారు. ఎన్నికల కమిటీలపై బీజేపీ కసరత్తు చేస్తోంది.