కృష్ణా నదిలో సాయిచంద్  అస్తికలు నిమజ్జనం

కృష్ణా నదిలో సాయిచంద్  అస్తికలు నిమజ్జనం

గద్వాల, వెలుగు : గిడ్డంగుల సంస్థ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్  అస్థికలను సోమవారం బీచుపల్లి దగ్గర కృష్ణా నదిలో కొడుకు, కూతురుతో కలిసి సాయిచంద్​ భార్య రజిని నిమజ్జనం  చేశారు. పురోహితులు అనిల్ శర్మ , నవీన్ శర్మ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి చంద్​ బంధువులు పాల్గొన్నారు.

రాష్ట్రం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది

మహబూబ్ నగర్ టౌన్ : సాయిచంద్  లాంటి ఓ గొప్ప కళాకారుడిని రాష్ట్ర కోల్పోయిందని మంత్రి  శ్రీనివాస్ గౌడ్  పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్​ భవన్ లో  తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం, కవులు, రచయితలు, కళాకారులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయిచంద్ సంస్మరణ సభకు మంత్రి హాజరై నివాళులు అర్పించారు. సాయిచంద్ భార్యకు కార్పొరేషన్  చైర్ పర్సన్  పదవి ఇచ్చి సీఎం కేసీఆర్  అండగా నిలిచారన్నారు. బాలచందర్, జయన్న, శివన్న, సీతారాములు, మహేశ్​ పాల్గొన్నారు.