యజమాని చావుకు కారణమైన పొట్టేలు

యజమాని చావుకు కారణమైన పొట్టేలు
  • పెంచుకున్న పొట్టేలే ప్రాణం తీసింది
  • వారం క్రితం భర్తను పొడిచింది
  • అమ్మేద్దామనుకునేలోపు ఘోరం 

గద్వాల, వెలుగు:  జిల్లాలోని ఇటిక్యాల మండలం యక్తపురం విలేజ్ లో ఆదివారం పొట్టేలు చేతిలో ఓ మహిళ ప్రాణం కొల్పోయింది. గ్రామానికి చెందిన చిట్టెమ్మ(45) మూడు పొట్టేళ్లను పెంచుకుంటోంది. వాటిని మేపేందుకు ఆదివారం ఉదయం పొలానికి తీసుకువెళ్తోంది. చెరువు గట్టుపై నుంచి చిట్టెమ్మ వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఒక పొట్టేలు బలంగా ఢీ కొట్టడంతో ఆమె చెరువులో పడిపోయింది. చుట్టుపక్కల వారు వచ్చి బయటికి తీసే లోపే ప్రాణాలు కోల్పోయింది. వారం కింద కూడా మృతురాలి భర్త రాముడిని ఇదే పొట్టేలు పొడిచిందని, రేట్ వస్తే అమ్మేద్దామనుకునే లోగా చిట్టెమ్మ ప్రాణం తీసిందని గ్రామస్థులు చెప్పుకుంటున్నారు.