- నిధులు మంజూరు చేస్తూ జీవో
హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో శానిటేషన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.14.56 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. హాస్పిటల్లో 4 లిఫ్ట్ల ఏర్పాటు కోసం మరో రూ.1.62 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో పాత డ్రైనేజీ వ్యవస్థ కావడంతో వాటర్ సెల్లార్లోకి రావడం, వాష్రూమ్లు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో శానిటేషన్ వ్యవస్థ ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.