హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండుతున్నయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నయి. దీంతో మార్చిలోనే జనానికి ఎండ వేడిమితో ఇబ్బందులు షురువైనయి. టీఎస్డీపీఎస్ డేటా ప్రకారం.. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని చర్పాలలో 40.8 డిగ్రీలు, నిర్మల్లోని నర్సాపూర్ (జి)లో 40.7, నిజామాబాద్లోని లక్మపూర్, భద్రాద్రి కొత్తగూడెంలోని మణుగూరు, నిర్మల్లోని తానూర్ లో 40.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది.