బెంగాల్​లో ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌‌పై సుప్రీం స్టే

బెంగాల్​లో ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌‌పై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తూ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు గురువారం స్టే విధించింది. సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీ ఎఫ్​సీ) సర్టిఫికెట్ పొందిందని, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. చట్టపరమైన నిబంధనలతో చిత్రప్రదర్శ నను అడ్డుకోవాలని చూడడం సరికాదని, అలా అనుకుంటే సినిమా లన్నీ కోర్టులకే చేరుతాయని సుప్రీంకోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీవై చంద్రచూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వం లోని బెంచ్  వ్యాఖ్యానిం చింది. వెస్ట్​ బెంగాల్​తో పాటు తమిళనాడులోనూ ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో తమిళనాడులోనూ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకు లకు రక్షణ కల్పించాలని సీఎం స్టాలిన్​ సర్కార్​ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.