హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యువతరం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. 44 ఏళ్లలోపు వారిలో మెజారిటీ యువత బీజేపీకి ఓటేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నడి వయసువారు, వృద్ధుల్లో ఎక్కువ మంది టీఆర్ఎస్కు అండదండగా ఉన్నారు. అయినా వారు బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండాలని కోరుకుంటున్నారు. 55 ఏళ్లు దాటినోళ్లు రెండో చాన్స్ కాంగ్రెస్కే అంటున్నరు.
- రాష్ట్రవ్యాప్తంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా అధికార పార్టీని ఆదరిస్తున్నట్టు గుర్తించారు.
- ఇంటర్, డిగ్రీ, ఆపైన చదువుకున్న ఉన్నత విద్యావంతుల్లో ఎక్కువ మంది బీజేపీని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లోస్తే కమలానికే ఓటేస్తామని సర్వేలో చెప్పారు. టెన్త్ లోపు చదివినోళ్లు, చదువుకోనివారు ఎక్కువగా టీఆర్ఎస్కు జై కొట్టారు.
- నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ఆర్టిజన్లు సర్కారుకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. వారిలో ఎక్కువగా బీజేపీ వైపే చూస్తున్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పెండింగ్ హామీలే దీనికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
- కులాలు, సామాజిక వర్గాల వారీగా పార్టీల ఓటింగ్శాతం ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా బీసీలు ఎక్కువ మంది బీజేపీకి అండగా ఉన్నారు. ఎస్సీలు, ఇతర కులాలకు చెందిన మెజారిటీ ఓటర్లు టీఆర్ఎస్కు జై కొట్టారు. రెడ్లు ఇరు పార్టీలను సమానంగా ఆదరిస్తున్న ట్రెండ్ కనబడింది. ఇక ఎస్టీలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.