
రేపటి నుంచి భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. బంగ్లాపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న టీం ఇండియా అంతే జోరుగా ఈ సిరీస్ ప్రారంభించాలని చూస్తుంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతిని ప్రకటించిన సెలక్షన్ కమిటీ, ఈ సిరీస్ మొత్తానికి యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే, లంక టీ20 జట్టుని తక్కువ అంచనా వేయలేం. కేప్టెన్ గా హార్దిక్ పాండ్యాని ప్రకటించింది.
ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు మంచి అవకాశం కానుంది. కాకపోతే సంజూ శాంసకు మళ్లీ ఎదురుచూపులు తప్పేలా లేవు. ఇప్పటి వరకు పోటీగా ఉన్న పంత్ స్థానంలో ఇప్పుడు ఇషాన్ కిషన్ వచ్చాడు. గత మ్యా్చ్ లో సూపర్ ఫామ్ లో ఉండి డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 మ్యాచ్ లు వరుసగా జనవరి 3, 5, 7 తేదీల్లో జరగనున్నాయి. జనవరి 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. మొదటి టీ20 మ్యాచ్ వాంఖెడే స్టేడియంలో జరుగుతుంది.
టీ20 సిరీస్ టీం:
హార్దిక్ పాండ్యా (కేప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు సాంసన్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముకేశ్ కుమార్
వన్డే సిరీస్ ఇండియా టీం:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్