11న  ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ

11న  ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ

హైదరాబాద్ : ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రానికి అదనపు నిధులు, వనరుల సమీకరణతో పాటు ప్రస్తుత రాజకీయ అంశాలపై కూడా చర్చించనున్నారు.

ఇప్పటికే FRBM పెంచాలని కేంద్రంపై సీఎం కేసీఆర్ వరుస కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రానికి మరిన్ని నిధుల అవసరం ఉండనుంది. వాటిని సమీకరించుకోవడంపై క్యాబినెట్ భేటీలో ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇటు మునుగోడు ఉప ఎన్నికపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.