రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి

రంగారెడ్డి జిల్లాలో గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి

రంగారెడ్డి జిల్లా మణికొండ మునిసిపల్ పరిధిలో విషాదం నెలకొంది. పుప్పాల్ గూడలో సెల్లార్ కోసం తీసిన గుంతలో గోడ మట్టి కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మూడు ఫ్లోర్స్ కోసం సెల్లార్ గుంత తీయడంతో గోడ కూలిపోయింది. సెల్లార్ గుంతకు ఆనుకుని స్లాబ్ కోసం కార్మికులు సెంట్రింగ్ పనులు చేస్తుండగా..ఒక్కసారిగా గోడ కుంగిపోవడంతో సెంట్రింగ్ డబ్బాలు మీద పడి చనిపోయారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు.. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలపై మట్టి పడడంతో జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు పోలీసులు.